Chandrababu: రామతీర్థం ఘటన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

  • రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై రాళ్లదాడి
  • చంద్రబాబే చేయించారంటూ కేసు నమోదు
  • అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపైనా కేసులు
Case filed against chandrababu in vizianagaram

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కేసు నమోదైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబే కారణమని, ఆయనే ఆ దాడి చేయించారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే, ఆ పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపైనా పీడీపీపీ యాక్ట్‌ కింద కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.


More Telugu News