K Kavitha: గాయపడ్డ మహిళకు కారు దిగి వచ్చి సాయం చేసిన కల్వకుంట్ల కవిత

  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ
  • కారులోంచి చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
  • ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు
  • నిజామాబాద్‌లో ఆలయాలను దర్శించుకుంటోన్న కవిత
kavita helps woman

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను కారులోంచి చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారు ఆపించి, ఆమె వద్దకు వచ్చి సాయం చేసి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేలా చేశారు. ఆ సమయంలో ఆమె వెంట తెలంగాణ జాగృతి మహిళా నేతలు కూడా ఉన్నారు.

ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత తొలిసారి కవిత నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంఠేశ్వర్‌ నుంచి ఆమె కారులో వెళ్తున్న సమయంలో మహిళకు జరిగిన ప్రమాదాన్ని గుర్తించారు.

కాగా, తన పర్యటనలో భాగంగా ఆమె ఈ రోజు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఇందల్వాయి మండలం దేవితండాలో ఆలయాన్ని, అనంతరం జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. మోపాల్‌ మండలం భైరాపూర్, డిచ్‌పల్లి మండలంలోనూ ఆమె పర్యటన ఉంటుంది.

More Telugu News