Hyderabad: హైదరాబాదుకు చెందిన వ్యక్తిపై అమెరికాలో దుండగుల కాల్పులు

  • నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన ముజీబుద్దీన్
  • ఆదివారం తెల్లవారుజామున దుండగుల కాల్పులు
  • తలకు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స
Hyderabad man attacked in America

హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్‌పై అమెరికాలో కాల్పులు జరిగాయి. ఆయన తలకు బుల్లెట్ గాయమైంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2016లో అమెరికా వెళ్లి ముజీబ్ అక్కడ ఉద్యోగం చేస్తుండగా, ఆయన భార్య అఫ్రోజ్ కౌసర్, ఇద్దరు కుమారులు, కుమార్తెలు సంతోష్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భారత కాలమానం ప్రకారం ఇల్లినాయిస్‌లో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.

ముజీబ్ తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో ఇంటికి వస్తానని మొన్ననే ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే ఇలా జరిగిందంటూ భార్య కౌసర్ కన్నీళ్లు పెట్టుకుంది.

More Telugu News