Prabhas: హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్: పూజా హెగ్డే

  • ఇటలీలో షూటింగ్ జరుపుకున్న రాధేశ్యామ్
  • ఇండియాకు తిరిగి వచ్చిన పూజా హెగ్డే
  • షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేశారంటూ టీమ్ కు కితాబు
Meet you in Hyderabad Prabhas says Pooja Hegde

ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లాక్ డౌన్ తర్వాత టీమ్ అంతా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. దాదాపు నెల రోజుల పాటు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొంది. అక్కడ షూటింగ్ ముగించుకుని పూజ ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పూజ అభిమానులతో పంచుకుంది.

'రాధేశ్యామ్' ఇటాలియన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నానని పూజ తెలిపింది. షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు... 'హైదరాబాదులో కలుద్దాం ప్రభాస్' అని చెప్పింది.

మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ పేరు విక్రమాదిత్య అని వెల్లడించేలా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More Telugu News