Rajasthan Royals: బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో బెంగళూరు వర్సెస్ రాజస్థాన్
  • బెంగళూరు జట్టులో మాన్, అహ్మద్ లకు చోటు
Rajasthan Royals has won the toss against Royal Challengers Banglore

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్, గుర్ కీరత్ సింగ్ మాన్ లను తీసుకున్నారు. శివం దూబే, మహ్మద్ సిరాజ్ లను తప్పించారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లలో నెగ్గగా, రాజస్థాన్ జట్టు 8 మ్యాచ్ లు ఆడి 5 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనదే పైచేయిగా కనిపిస్తోంది.

More Telugu News