Natti Kumar: 'దిశ ఎన్ కౌంటర్' చిత్రంపై కోర్టు ఎలా చెబితే అలా చేస్తాం: నిర్మాత నట్టికుమార్

  • 'దిశ ఎన్ కౌంటర్' పేరిట వర్మ చిత్రం
  • హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
  • కేంద్రం, సెన్సార్ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు
  • దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్న నట్టి
Producer Natti Kumar says they will follow court orders

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్ కౌంటర్' పేరిట సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత నట్టికుమార్ స్పందిస్తూ, 'దిశ ఎన్ కౌంటర్' చిత్రంపై కోర్టు నిర్ణయాన్ని అనుసరిస్తామని, కోర్టు ఏంచెబితే అది పాటిస్తామని స్పష్టం చేశారు. ఏవైనా సీన్లు తొలగించాలని కోర్టు చెప్పినా, అందుకు తాము సమ్మతమేనని వివరించారు.

దిశ తల్లిదండ్రులను బాధించేలా ఈ చిత్రం తీయలేదని, సమాజంలోని ఓ ఘటనను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నామని తెలిపారు. దిశ తల్లిదండ్రుల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని నట్టి కుమార్ స్పష్టం చేశారు. కాగా, దిశ తండ్రి ఈ సినిమాపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయన వినతిపత్రంలోని అంశాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డులకు ఆదేశాలు జారీచేసింది.

More Telugu News