Robbery: మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై భారీ చోరీ.... రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోచేసిన దుండగులు

  • 980 మొబైల్ ఫోన్లు చోరీ
  • శ్రీసిటీ నుంచి కోల్ కతా వెళుతున్న కంటెయినర్
  • కంటెయినర్ వెనుకభాగం తెరిచి దోపిడీ
Thieves stolen mobile phones from a container near Mangalagiri

గుంటూరు-మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కోల్ కతాకు మొబైల్ ఫోన్లను ఓ కంటెయినర్ లో తరలిస్తున్నారు. ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్టు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్ కు తెలిపాడు. దాంతో వాహనం ఆపిన కంటెయినర్ డ్రైవర్ వెనుకభాగంలో పరిశీలించగా, చోరీ జరిగినట్టు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో కాజ టోల్ గేట్ వద్ద కంటెయినర్ ను నిలిపి, మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, మధ్యప్రదేశ్ కు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదే తరహాలో కొన్నివారాల కిందట చిత్తూరు జిల్లాలోనూ ఓ కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.

More Telugu News