trailer: 'క్షీర సాగర మథనం' ట్రైలర్ విడుదల చేసిన క్రిష్‌

  • అనిల్‌ పంగులూరి దర్శకత్వంలో సినిమా
  • నిర్మిస్తోన్న శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ హార్ట్‌ క్రియేషన్స్‌
  • సంజయ్‌ కుమార్‌, మానస్‌ నాగులపల్లి కీలక పాత్రల్లో మూవీ
ksheera saagara madhanam movie trailer realease

దర్శకుడు క్రిష్‌ చేతుల మీదుగా తెలుగు సినిమా 'క్షీర సాగర మథనం' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకి ‌ అనిల్‌ పంగులూరి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ హార్ట్‌ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో సంజయ్‌ కుమార్‌, మానస్‌ నాగులపల్లి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎదలోని భావాలు అదుపుతప్పి తప్పు దారి పడితే.. మనలోని మనకే తెలియక జరిగే అంతర్మథనమే 'క్షీరసాగర మథనం' అంటూ ఓ డైలాగ్‌ వినపడుతోంది. ఈ సినిమాలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాల కథను చూపెడతామని అనిల్‌ పంగులూరి చెప్పారు. యువత చేసే పొరపాట్లు, వాటి పర్యవసానాల చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా సాగుతుందన్న విషయం ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. యువత, ప్రేమ వారి మధ్య జరిగే సంఘర్షణలను ఇందులో చూపించారు.      
 
             

More Telugu News