YS Vivekananda Reddy: వివేక హత్య కేసులో కొనసాగుతోన్న సీబీఐ దర్యాప్తు.. హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్న కుమార్తె సునీత

  • మూడో రోజు పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు
  • వివేక హత్యకేసుకు సంబంధించిన వివరాల సేకరణ  
  • గత ఏడాది దారుణ హత్యకు గురైన వివేక 
sunita reaches pulivendula

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ జరుపుతోన్న కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రెండు రోజుల పాటు పులివెందులలో పలువురిని కలిసింది. వివేక ఇంటికి, పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. వివేక హత్యకేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు మరోసారి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి కేసు వివరాలపై ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్నారు. అధికారులతో ఆమె మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం మూడు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, ఈ కేసును ఛేదించలేకపోయారు. దాంతో ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వివేక కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు.

More Telugu News