Vijay Sai Reddy: చంద్రబాబు మోకాలడ్డాడు అంతే... వేతన సమస్య మూడ్రోజుల్లో సమసిపోతుంది: విజయసాయి

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని వేతనాలు
  • ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్నారన్న విజయసాయి
  • చంద్రబాబు కక్ష సాధిస్తున్నాడంటూ ఆరోపణలు
Vijayasi Reddy says Chandrababu causes present salary crisis

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కావడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లును మండలిలో అడ్డుకున్న చంద్రబాబు ఉద్యోగులను వేధిస్తున్నాడని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా తన వక్రబుద్ధిని మార్చుకోవడంలేదని, ప్రజలపైన కక్ష సాధిస్తున్నాడని పేర్కొన్నారు. "చంద్రబాబు మోకాలడ్డాడు అంతే. ఈ బిల్లుకు మండలి ఆమోదం అవసరంలేదు. మరో మూడ్రోజుల్లో ఉద్యోగుల వేతనాల సమస్య తొలగిపోతుంది" అని స్పష్టం చేశారు.

More Telugu News