Kadapa District: కడప జిల్లాలో కారును ఢీకొన్న రైలింజన్.. ఒకరి మృతి

  • ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు వద్ద ప్రమాదం
  • ట్రాక్ పై ఆగిపోయిన కారు
  • కారును 200 మీటర్లు లాక్కెళ్లిన రైలింజన్
Rail engines drags car for 200 m in Kadapa Dist

కడప జిల్లాలో కారును రైలింజన్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ఎర్రగుంట్ల మండలం వై.కోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్ కు వెళ్లే రైల్వే ట్రాక్ లెవెల్ క్రాసింగ్-3 వద్ద కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్ మీద ఆగిపోయింది. అదే సమయంలో ఓ రైలింజన్ వచ్చింది. కారును దాదాపు 200 మీటర్లు లాక్కెళ్ళింది. ఆ సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో రైలింజన్ 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

More Telugu News