Perni Nani: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచామన్నది అవాస్తవం: మంత్రి పేర్ని నాని

  • లాక్ డౌన్  తర్వాత కూడా ఛార్జీలు పెంచే  ఆలోచన లేదు
  • ఛార్జీలు పెంచామంటూ దుష్ప్రచారం చేస్తే ఊరుకోం
  • అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు
Minister Perni Nani Statement

ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలను ప్రభుత్వం పెంచిందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచామనేది అవాస్తవమని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా ఛార్జీలు పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఛార్జీలు పెంచామంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News