Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా పాజిటివ్ కేసుల నమోదు

  • ఇప్పటి వరకు ‘గ్రీన్ జోన్’ లో ఉన్న జిల్లాలో ‘కరోనా’ కేసులు
  • ఆత్మకూరు (ఎం) మండలంలో 3  కేసులు
  • సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదు
 corona positive cases found in Yadadri district

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు గ్రీన్ జోన్ లో ఉన్న ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లా పరిధిలోని ఆత్మకూరు (ఎం) మండలంలో 3 పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలిపారు. ‘కరోనా’ పాజిటివ్ వచ్చిన నలుగురూ ఇటీవలే ముంబై నుంచి తమ స్వగ్రామాలకు వచ్చారని అధికారుల సమాచారం. ఈ నలుగురి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్టు  అనితా రామచంద్రన్ తెలిపారు.

More Telugu News