Kadapa District: కడపలో కరోనా నుంచి కోలుకున్న 13 మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు

  • కోలుకున్నవారికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్
  • వైద్య సిబ్బందికి అభినందనలు
  • ఏపీలో 534 కరోనా పాజిటివ్ కేసులు
Thirteen corona patients got discharged from hospitals in Kadapa

ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా రక్కసి ఏపీలో గణనీయమైన స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం పరిమితంగానే ఉన్నా, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఉద్ధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో, కడప జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకోవడం ఊరట కలిగించే అంశం. వీరిని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, వారికి అంకితభావంతో సేవలు అందించారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం ఏపీలో  534 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గుంటూరు (122), కర్నూలు (113) జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

More Telugu News