Pavan kalyan: పవన్ .. హరీశ్ శంకర్ సినిమాలో లావణ్య త్రిపాఠి

  • 'అర్జున్ సురవరం'తో దక్కిన హిట్
  • హరీశ్ శంకర్ సినిమాలో ఛాన్స్
  • త్వరలో రానున్న స్పష్టత
Harish Shankar Movie

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతోంది. ఆ తరువాత క్రిష్ .. హరీశ్ శంకర్ లైన్లో వున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక చిత్రం చేయనున్న పవన్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

పవన్ - హరీశ్ శంకర్ దర్శకత్వంలో గతంలో 'గబ్బర్ సింగ్' వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కథానాయికగా అలరించిన శ్రుతి హాసన్ ను, ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా లావణ్య త్రిపాఠి పేరు తెరపైకి వచ్చింది. అయితే శ్రుతి హాసన్ కి బదులుగా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారా? లేదంటే రెండవ కథానాయికగా ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ మధ్య వచ్చిన 'అర్జున్ సురవరం' సినిమాతో లావణ్య త్రిపాఠి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

More Telugu News