Chandrababu: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బోండా, బుద్ధా.. పరామర్శించిన చంద్రబాబు

  • మాచర్లలో టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి
  • ఘటన వివరాలను బోండా, బుద్ధాలను అడిగి తెలుసుకున్న బాబు
  • ఈ దాడిలో ధ్వంసమైన వాహనాన్ని పరిశీలించిన చంద్రబాబు
Chandrababu asks details about Macherla incident from Bonda Buddha

మాచర్లలో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రైవర్ చాకచక్యంతో ఈ దాడి నుంచి తప్పించుకున్న ఇద్దరు నేతలు కొంచెం సేపటి క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బోండా, బుద్ధాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించిన వివరాలను చంద్రబాబుకు వారు వివరించారు. ఈ దాడిలో ధ్వంసమైన వాహనాన్ని బాబు పరిశీలించారు.


More Telugu News