MIM: విద్యార్థులపై కాల్పులు పిరికి చర్య.. సీఏఏపై నిరసనలు కొనసాగుతాయి: అసదుద్దీన్ ఒవైసీ

  • ఈ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను
  • గాంధీ వర్ధంతి రోజు ఈ ఘటన జరగడం దురదృష్టకరం
  • ఇటువంటి ఘటనలు మమ్మల్ని భయపెట్టవు

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై ఈ రోజు మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. దీనిని పిరికి చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి రోజున కాల్పుల ఘటన జరగటం దురదృష్టకరం అన్నారు. ఈ మేరకు ఒవైసీ ట్వీట్టర్ వేదికగా తన స్పందనను పోస్ట్ చేశారు.

‘ఉగ్రవాది గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేయడాన్ని తాము గుర్తుచేసుకుంటున్న సందర్భంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఆ గాంధీకి నివాళులు అర్పించడానికి వెళుతున్నారు. ఇది పిరికిపంద చర్య. ఇటువంటి ఘటనలు మమ్మల్ని భయపెట్టవు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయి. ఈ పోరాటం గాడ్సేకు.. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, నెహ్రూ కలలుకన్న భారత్ కు మధ్య పోరాటంగా మారింది. ఏ పక్షం వైపు ఉండాలన్నది తేలికగా మనం నిర్ణయించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News