Rule-71: శాసనమండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు

  • రూల్ 71 కింద నోటీసు ఇచ్చిన టీడీపీ
  • అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 ఓట్లు
  • వైసీపీకి అనుకూలంగా ఓటేసిన పోతుల సునీత, శివనాగిరెడ్డి

శాసనమండలిలో రూల్ 71పై జరిగిన ఓటింగులో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. రూల్ 71 కింద తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీసుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి ఓటేశారు. ఈ ఓటింగులో అనుకూలంగా 27 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. 9 మంది సభ్యులు తటస్థంగా ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత, శివనాగిరెడ్డిపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. వారిపై చర్యల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఓటింగ్ అనంతరం శాసనమండలిని బుధవారానికి వాయిదా వేశారు.

More Telugu News