Kalyan Ram: సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఎంత మంచివాడవురా'

  • మనుషులు .. మమతలు చుట్టూ తిరిగే కథ 
  •  కల్యాణ్ రామ్ జోడీగా మెహ్రీన్ 
  •  ఈ నెల 15వ తేదీన భారీ విడుదల

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన 'ఎంత మంచివాడవురా' చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. కుటుంబం .. మనుషులు .. మమతలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కారణంగానే గట్టిపోటీ ఉన్నప్పటికీ, ఈ కథపై నమ్మకంతో ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఒక వైపున మహేశ్ బాబు .. మరో వైపున అల్లు అర్జున్ సినిమాలు భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News