Adilabad country bomb explode: ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు.. యువకుడి శరీరం ఛిద్రం

  • ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
  • బైక్ పై నాటు బాంబు తీసుకెళుతున్న సమయంలో విస్పోటనం
  • మృతుడు మహారాష్ట్రలోని కారిగావ్ కు చెందిన వ్యక్తి 

నిత్యం జనంతో రద్దీగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్డు ప్రదేశం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. వివరాలను పరిశీలిస్తే.. అడవి పందులను వేటాడటానికి ఉపయోగించే నాటు బాంబులను మోటార్ సైకిల్ పై ఇద్దరు వ్యక్తులు తీసుకువెళుతుండగా పేలుడు సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. పేలుడు ధాటికి బైక్ పై ఉన్న ఓ వ్యక్తి శరీరం ఛిద్రమైపోయిందని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. మృతుడు మహారాష్ట్రలోని కారిగావ్ కు చెందిన మనిరామ్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News