Andhra Pradesh: మూడు రాజధానుల ప్రతిపాదనపై 27 తర్వాతే కాంగ్రెస్ స్పందిస్తుంది: కేవీపీ

  • కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి ప్రకటన పూర్తిగా వ్యక్తిగతం
  • చిరంజీవి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారంటున్న పార్టీ వర్గాలు
  • ఈ నేపథ్యంలోనే కేవీపీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ పై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేవీపీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల ప్రతిపాదనకు కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి మద్దతు తెలపడంపై కేవీపీ మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై తమ పార్టీ నిర్ణయం ఈ నెల 27 తర్వాతే వెలువరిస్తుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా కొనసాగుతున్నప్పటికీ.. పార్టీ వర్గాలు మాత్రం మెగాస్టార్ కాంగ్రెస్ లోనే ఉన్నారని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ స్పందించడం ఆసక్తిగా మారింది.

More Telugu News