BSE: ఆరంభమే అదిరింది... లిస్టింగ్ రోజున 60 శాతం పెరిగిన ఉజ్జీవన్ ఈక్విటీ!

  • ఇటీవల ఐపీఓకు వచ్చిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
  • రూ. 37 ఈక్విటీ విలువ కాగా, రూ. 62కు ఈక్విటీ
  • రూ. 4,300 కోట్లకు పెరిగిన మాతృసంస్థ మార్కెట్ కాప్

ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సమీకరించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గురువారం నాడు స్టాక్ ఎక్చేంజ్ లో లిస్టింగ్ అయింది. ఆరంభం రోజునే నమ్ముకున్న ఇన్వెస్టర్లకు 60 శాతం ప్రీమియంను అందించింది. ఒక్కో ఈక్విటీ వాటాను రూ. 36 నుంచి రూ. 37 మధ్య పబ్లిక్ ఆఫర్ కు ఉంచగా, 166 రెట్లు ఓవర్ సబ్ స్క్రయిబ్ అయిన ఉజ్జీవన్ ఇష్యూ, కనీసం 50 శాతం ప్రీమియంను ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, అంచనాలను మించి ఈక్విటీకి డిమాండ్ కనిపించింది. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ ఈక్విటీ రూ. 62కు చేరింది. దీంతో సంస్థ పేరెంట్ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ కాప్ రూ. 4,300 కోట్లకు పైగా పెరగడం గమనార్హం.

More Telugu News