Visakhapatnam: విశాఖ కైలాసగిరిపై దారుణం.. యువతిపై బాలుర సామూహిక అత్యాచారం

  • యువతిని కొండపైకి తీసుకెళ్లిన బాలుడు
  • కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి అత్యాచారం
  • ఆపై అతడి స్నేహితులు కూడా..

విశాఖపట్టణంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కైలాసగిరిపై దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ యువతి (22), బాలుడు (18) కైలాసగిరికి చేరుకున్నారు. కొండపై కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత ఇద్దరూ ఓ ప్రదేశంలో కూర్చున్నారు. అనంతరం బాలుడు ఓ కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. యువతి మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అప్పటికే అక్కడికి చేరుకున్న బాలుడి స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బాలురను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో పడి వున్న బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు అని, మరో నిందితుడి పేరు గురివిల్లి రమణ అని పోలీసులు తెలిపారు. జోడుగుళ్లపాలేనికి చెందిన వీరిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News