Crime News: గుర్తు తెలియని మహిళను చంపి తగులబెట్టిన దుండగులు

  • వికారాబాద్‌ జిల్లా పరిగిలో దారుణం
  • హైదరాబాద్‌-బీజాపూర్‌ దారిలో తెల్లవారు జామున ఘటన
  • మృతురాలు ఎవరన్నది తేలాల్సి ఉంది

గుర్తు తెలియని దుండగులు ఈ రోజు తెల్లవారు జామున ఓ మహిళను హత్యచేసి అనంతరం నిప్పంటించి తగులబెట్టారు.  హైదరాబాద్‌-బీజాపూర్‌ దారిలో వికారాబాద్‌ జిల్లా పరిగి పరిధిలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...పరిగి సమీపంలో రోడ్డు పక్కన తుప్పల్లో మంటల్లో పూర్తిగా దహనమైన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో ఈ మహిళ ఎవరు? హత్య చేసిన దుండగులు ఎవరు? హత్యకు గల కారణాలు ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News