Uttar Pradesh: సెక్స్ రాకెట్‌లో దొరికిన అమ్మాయిలు.. వారు చెప్పింది విని పోలీసుల షాక్

  • మీరట్‌లోని వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం
  • 36 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏహెచ్‌టీయూ
  • తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పడంతో పోలీసుల అవాక్కు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఓ హోటల్‌పై దాడిచేసి కొన్ని జంటలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న కొన్ని జంటలు కూడా వీరిలో ఉండడం విశేషం. వ్యభిచార ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ)ను ఏర్పాటు చేశారు. హోటల్‌పై దాడిచేసి 36 మందిని అదుపులోకి తీసుకున్నది ఈ బృందమే. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు.

పోలీసుల అదుపులో ఉన్న అమ్మాయిలు తమ ముఖాన్ని చున్నీతో కప్పేసుకోగా, అబ్బాయిలు హెల్మెట్లతో కవర్ చేసుకున్నారు. వీరిని విచారించే సమయంలో విస్తుపోయే విషయాలు చెప్పారు. వారు చెప్పింది విని పోలీసులే షాకయ్యారు. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని, తమను వదిలేయాలని కొందరు ప్రాధేయపడ్డారు. తమకు నిశ్చితార్థం కూడా అయిపోయిందని, కావాలంటే చూడాలంటూ నిశ్చితార్థపు ఉంగరాలను కూడా చూపించారు. దీంతో పోలీసులు అటువంటి జంటలను అక్కడే వదిలిపెట్టారు. మిగతా వారిని మాత్రం స్టేషన్‌కు తీసుకెళ్లారు.

More Telugu News