Ajinkya Rahane: రహానే సెంచరీ... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

  • నార్త్ సౌండ్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు
  • రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 320 పరుగులతో ఆడుతున్న భారత్
  • రాణించిన కోహ్లీ, విహారి

వెస్టిండీస్ తో నార్త్ సౌండ్ లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే సెంచరీ సాధించాడు. మిడిలార్డర్ లో వచ్చిన రహానే... కెప్టెన్ కోహ్లీ (51), హనుమ విహారి (80 బ్యాటింగ్) తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడమే కాకుండా అద్భుతరీతిలో శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 297 పరుగులు చేయగా, విండీస్ 222 పరుగులకు ఆలౌటైంది. బదులుగా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లీసేన ఆట నాలుగో రోజు మధ్యాహ్నం సమయానికి 4 వికెట్లకు 320 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 395 పరుగులకు చేరుకుంది. క్రీజులో రహానే, విహారి ఆడుతున్నారు.

More Telugu News