srinivas reddy: హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో కీలక సాక్ష్యాల సేకరణ

  • ముగ్గురు విద్యార్థినులపై హత్యాచారం చేసిన సైకో కిల్లర్
  • హత్య ప్రదేశంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ గుర్తింపు
  • కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించే అవకాశం

హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం చేసి, వారిని కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సంపాదించారు. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను పోలీసులు గుర్తించారు. మరోవైపు మృత దేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్ రెడ్డివేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. దీనికితోడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కోర్టుకు పోలీసులు అందించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించనున్నట్టు సమాచారం.

More Telugu News