Kerala: 'ఐసిస్'లో చేరిన కేరళ యువకుడి మృతి?

  • 2017లో ఇంటి నుంచి పారిపోయిన ముహాసిన్
  • అల్లా సేవలో అమరుడయ్యాడు
  • చనిపోయాడంటూ వాట్స్ యాప్ మెసేజ్

2017లో ఇంటి నుంచి పారిపోయి ఆఫ్గనిస్థాన్ మీదుగా సిరియా చేరుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో చేరిపోయాడని భావిస్తున్న మలప్పరం జిల్లా ఇడప్పల్ కు చెందిన మహమ్మద్ ముహాసిన్ చనిపోయినట్టు సమాచారం. అతని మరణంపై కుటుంబ సభ్యులకు వాట్స్ యాప్ మెసేజ్ వచ్చింది. మలయాళంలో ఉన్న ఈ మెసేజ్ లో "‘అల్లా సేవలో తరించాలనే మీ సోదరుని కోరిక నెరవేరింది. పది రోజుల క్రితం మీ సోదరుడు అమరుడయ్యాడు" అని ఉంది.

 ఈ విషయాన్ని పోలీసులకు చెబితే, మీకే ప్రమాదమని కూడా మెసేజ్ పంపిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు. మృతదేహం ఫోటోను కూడా పంపించాడు. మెసేజ్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించిన ముహాసిన్ తల్లిదండ్రులు, సోదరుడు శోకసంద్రంలో మునిగిపోయారు. ముహాసిన్ తో పాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా ఉగ్రవాదుల్లో చేరాడని, అయితే, ఈ మెసేజ్ ని ఎవరు పంపించారన్న విషయం తేలాల్సి వుందని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

More Telugu News