Mayawati: కుమారస్వామికి ఓటేయబోనన్న బీఎస్పీ ఎమ్మెల్యే.. లేదు, వేయాల్సిందేనన్న మాయావతి!

  • మాయావతి సూచన మేరకు బలపరీక్షకు హాజరు కాబోవడం లేదన్న మహేశ్
  • ఆ వెంటనే ట్వీట్ చేసిన మాయావతి
  • కుమారస్వామికే ఓటేయాలని ఆదేశించినట్టు చెప్పిన బీఎస్పీ చీఫ్

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోబోతున్న తరుణంలో బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. కుమార స్వామి ప్రభుత్వానికి అనుకూలంగా తమ ఎమ్మెల్యే ఓటు వేస్తారని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

అయితే, మాయావతి ట్వీట్‌కు ముుందే బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ మాట్లాడుతూ.. అధినేత్రి మాయావతి సూచన మేరకు నేటి బలపరీక్షకు హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఆ ప్రకటన తర్వాత కాసేపటికే మాయావతి ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీకి హాజరై తమ ఎమ్మెల్యే కుమారస్వామికి అనుకూలంగా ఓటు వేస్తారని మాయావతి ప్రకటించారు.

కాగా, గత నెల రోజులుగా జరుగుతున్న కర్ణాటక హై డ్రామాకు నేటితో తెరపడే అవకాశం ఉంది. రెబల్ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News