SCR: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని స్టేషన్లలోనూ వైఫై... 100 రోజుల్లోనే!

  • ద.మ.రైల్వే పరిధిలో 753 స్టేషన్లు
  • ఇప్పటికే 207 స్టేషన్లలో వైఫై
  • అన్ని స్టేషన్లకూ విస్తరిస్తామన్న జీఎం 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ రాబోయే 100 రోజుల్లో వైఫై సౌకర్యం చేరువ కానుందని జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. ద.మ.రైల్వే పరిధిలో మొత్తం 753 స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 207 స్టేషన్లలో వైఫై అందుబాటులో ఉందని ఆయన గుర్తు చేశారు. ఏ 1, ఏ కేటగిరీల్లోని 36 పెద్ద స్టేషన్లతో పాటు 171 చిన్న స్టేషన్లలో ప్రయాణికులకు వైఫై సౌకర్యాన్ని దగ్గర చేశామని, మరో 76 స్టేషన్లలో వైఫై పరికరాల ఏర్పాటు పూర్తయిందని వెల్లడించారు.

'రైల్‌ వైర్‌' పేరుతో అందిస్తున్న ఈ సేవలను వంద రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరిస్తామని తెలిపారు. గడచిన మే నెలలో 10 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్లలో వైఫై వాడారని, హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, గుంతకల్‌ స్టేషన్ లలో వినియోగం అధికమని అన్నారు.

More Telugu News