Kiwis: పోటీపడి బంతులు మింగేస్తున్న కివీస్ బ్యాట్స్ మెన్

  • కివీస్ స్కోరు 28 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు
  • క్రీజులో విలియమ్సన్, టేలర్
  • పకడ్బందీగా బంతులేస్తున్న టీమిండియా బౌలర్లు

టీమిండియాతో సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి బంతి నుంచే భారత్ బౌలర్లు పకడ్బందీగా అటాక్ చేస్తుండడంతో కివీస్ ఆటగాళ్లు ఆత్మరక్షణలో పడిపోయారు. ఏ జట్టుకైనా ఓపెనర్ల శుభారంభం అత్యంత కీలకం. కానీ ఈ విషయంలో కివీస్ కు మైనస్ మార్కులు పడ్డాయి. దానికితోడు, ఆపద్బాంధవుడిగా పేరొందిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులో ఉన్నా పరుగులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడంలేదు.

క్రీజులో ఉన్న విలియమ్సన్, రాస్ టేలర్ లు పోటీలు పడి మరీ జిడ్డు ఆట ఆడుతున్నారు. 28 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు కాగా, విలియమ్సన్ 44, టేలర్ 15 పరుగులతో ఆడుతున్నారు. విలియమ్సన్ ఆ పరుగులు చేయడానికి 73 బంతులు తీసుకోగా, టేలర్ కు 30 బంతులు అవసరమయ్యాయి.

More Telugu News