ram: 'ఇస్మార్ట్ శంకర్' కొత్త విడుదల తేదీ

  • పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
  • వరల్డ్ క్రికెట్ కారణంగా విడుదల తేదీ మార్పు
  • జూలై 18కి విడుదల వాయిదా

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. రామ్ సరసన నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను జూలై 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.

అయితే ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ కప్ కోసం క్రికెట్ పరంగా జరుగుతోన్న పోరుపైనే వుంది. అందువలన ఆ ప్రభావం 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్లపై పడొచ్చనే ఉద్దేశంతో విడుదల తేదీని జూలై 18వ తేదీకి మార్చారు. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో రామ్ ను పూర్తి మాస్ లుక్ తో పూరి చూపిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను అలరించడానికి అందుకు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడు. ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.

More Telugu News