West Bengal: కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తం

  • బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై నిరసన
  • భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు..పలువురికి గాయాలు

కోల్ కతాలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలపై దాడులను, తృణమూల్ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులు ఆపాలని నినదించారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, వాటర్ కేనన్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు హెచ్చరించారు.

More Telugu News