ys jagan: వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎల్

  • సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన జీవీఎల్
  • జగన్ ను అభినందించి దుశ్శాలువాతో సత్కారం
  • ఉదయం జగన్ ని కలిసిన నిఖిల్ గౌడ

ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జగన్ ని దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తనను కలిసి అభినందించిన జీవీఎల్ కు జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఈరోజు ఉదయం జగన్ ని కలిసి అభినందించారు.

More Telugu News