Old Woman: కశ్మీర్లో రెచ్చిపోయిన అల్లరిమూకలు.. వృద్ధురాలికి అండగా నిలిచిన జవాను.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు!

  • రాళ్ల దాడికి తెగబడిన అల్లరిమూకలు
  • గందరగోళంలో పడిపోయిన వృద్ధురాలు
  • సాయం కోసం అర్థిస్తూ కేకలు
  • సురక్షితంగా బ్రిడ్జి దాటించిన జవాను

ఈద్ పండుగ రోజు కూడా కశ్మీర్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. నేడు ఈద్ ప్రార్థనల అనంతరం బారాముల్లాలో అల్లరి మూకలు పౌరులపై రాళ్ల దాడికి తెగబడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన భద్రతా బలగాల ఔన్నత్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది. అల్లరి మూకల రాళ్ల దాడిలో బ్రిడ్జిపై వెళుతున్న ఓ వ‌ృద్ధురాలు గందరగోళంలో పడిపోయింది. కేకలు పెడుతూ సాయం కోసం అర్థించింది.

ఆమె బాధను ఆలకించిన ఓ జవాను ఆమెకు అండగా నిలిచి సురక్షితంగా బ్రిడ్జి దాటించాడు. తన ప్రాణాలు కాపాడిన జవానుకు వృద్ధురాలు ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి భారత జవానుల ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

More Telugu News