kumaraswamy: మీరు 100 సార్లు స్నానం చేసినా.. గేదెలాగే ఉంటారు: కుమారస్వామిపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు

  • మోదీ మేకప్ వేసుకుంటారని ఎద్దేవా చేసిన కుమారస్వామి
  • తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత రాజు ఖగే
  • స్వామిని గేదెతో పోల్చిన వైనం

ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు హద్దుమీరుతున్నాయి. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై బీజేపీ నేత రాజు ఖగే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి ఒక గేదె అంటూ కించపరిచే విధంగా మాట్లాడారు. మేకప్ వేసుకోవడం వల్లే ప్రధాని మోదీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందంటూ కుమారస్వామి విమర్శించిన నేపథ్యంలో, ఆయనపై రాజు ఈ మేరకు వ్యాఖ్యానించారు.

మోదీ ప్రతి రోజు ముఖానికి 10 సార్లు పౌడర్ వేసుకుంటారని, 10 డ్రస్సులు మార్చుతారని కుమారస్వామి అన్నారని రాజు మండిపడ్డారు. మీరు 100 సార్లు స్నానం చేసినా గేదెలాగే ఉంటారని ఎద్దేవా చేశారు.

More Telugu News