kumaraswamy: బీజేపీ తీరు చాలా దారుణం.. హిందువులు దీన్ని భరిస్తారా?: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

  • హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. దేవాలయాలపై కూడా దాడులు చేస్తోంది
  • బీజేపీని దేవుడు రూపుమాపుతాడు
  • సోదాలు నిర్వహించిన అధికారులను తొలగించాలి

మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామ నిప్పులు చెరిగారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ... చివరకు హిందూ దేవాలయంపై కూడా దాడులు చేసిందని ఆయన మండిపడ్డారు. మా దేవాలయంలో సోదాలు చేసి, ఖాళీ చేతులతో తిరిగి వెళ్లారని చెప్పారు. ఈ అపవిత్రమైన చర్యతో బీజేపీని దేవుడు రూపుమాపుతాడని వ్యాఖ్యానించారు.

గతంలో కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించినవారు... ఇప్పుడు దేవాలయాల్లోకి సైతం ప్రవేశిస్తున్నారని కుమారస్వామి విమర్శించారు. ఇలాంటి చర్యలను హిందువులు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పురాతన ఆలయంలో సోదాలు నిర్వహించిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

More Telugu News