tadepalligudem: తాడేపల్లిగూడెంలో యువకుల మధ్య గొడవ.. ఒకరి మృతి

  • మద్యం మత్తులో గొడవపడ్డ యువకులు
  • అడ్డుకోబోయిన వ్యక్తికి కత్తిపోట్లు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉన్న మసీదు సెంటర్లో నిన్న అర్ధరాత్రి యువకుల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో షేక్ జానీ, మద్దుకూరి సంపత్ లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో, జానీపై సంపత్ చాకుతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడికి తెగబడ్డారు.

ఈ దాడిలో పిల్లి వెంకన్న (45) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు తీవ్రంగా గాయపడ్డి జానీ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సంపత్ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News