Andhra Pradesh: ఏపీలో 45 లక్షల మంది రైతులకు అన్నదాతా సుఖీభవ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం!

  • ఇప్పటికే ప్రయోగాత్మకంగా రూ.వెయ్యి డిపాజిట్
  • తాజాగా మరో రూ.3 వేలు జమ
  • సన్నకారు రైతులకు రూ.15 వేల సాయం
  • పెద్ద రైతులకు రూ.10 వేల చెల్లింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ కింద నగదును రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో రూ.1000ను ప్రభుత్వం డిపాజిట్ చేసింది. తాజాగా మిగిలిన రూ.3,000ను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఏపీలోని 45 లక్షల మంది రైతులకు రూ.1,349.81 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఎకరాలలోపు ఉన్న సన్న,చిన్నకారు రైతులకు కేంద్రం సాయంతో కలిపి రూ.15,000, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.10,000 ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

More Telugu News