YS Sharmila: షర్మిల ఉంగరం కాజేసిన దొంగను పట్టుకోండి: గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశాలు!

  • రెండు రోజుల క్రితం దొంగతనం
  • పోలీసులకు ఫిర్యాదు చేయని వైఎస్ షర్మిల
  • తాడేపల్లి చోరుల పనేనని అనుమానం

రెండు రోజుల క్రితం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వేళ, షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని ఓ దొంగ కొట్టేసిన ఘటనపై పోలీసులు స్పందించారు. తన ఉంగరం పోయిందని షర్మిల ఎటువంటి ఫిర్యాదూ చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా, దొంగను పట్టుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు నుంచి సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ తరహా నేరాలకు పాల్పడటంలో తాడేపల్లికి చెందిన దొంగలు ఆరితేరారని భావిస్తున్న పోలీసులు, ఈ దిశగా దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో ఈ ప్రాంతంలో మంత్రులు, ఎమ్మెల్యేల జేబులను ఎన్నోమార్లు కేటుగాళ్లు కత్తిరించిన ఘటనలున్నాయి.

More Telugu News