anu emmanuel: అందుకే వెనకబడ్డాను .. ఇకపై జాగ్రత్తగా వుంటాను: అనూ ఇమ్మాన్యుయేల్

  • 'మజ్ను'తో తెలుగు తెరకు పరిచయం
  • యూత్ లో పెరిగిన క్రేజ్  
  • వరుసగా పలకరించిన పరాజయాలు  

తెలుగు తెరకి 'మజ్ను' సినిమా ద్వారా కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పరిచయమైంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ సుందరి కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో, అల్లు అర్జున్ జోడీగా 'నా పేరు సూర్య' .. పవన్ సరసన 'అజ్ఞాతవాసి' .. చైతూతో 'శైలజా రెడ్డి అల్లుడు' చేసింది. ఈ సినిమాలన్నీ వరుసగా పరాజయంపాలు కావడంతో, సహజంగానే అనూ ఇమ్మాన్యుయేల్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

తాజాగా ఆమె మాట్లాడుతూ .."కెరియర్ తొలినాళ్లలో వరుసగా గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్లాను. అదే సమయంలో నాకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను చేశాను. ఈ కారణంగానే నేను వెనకబడిపోయాను. ఇకపై కథల విషయంలో .. నా పాత్రల విషయంలో జాగ్రత్తగా వుంటాను. గ్లామర్ తోపాటు నటనకి అవకాశం వుండే ప్రాధాన్యత గల పాత్రలను మాత్రమే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.

More Telugu News