ys viveka: ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి: సీఈసీకి వైయస్ వివేకా కుమార్తె ఫిర్యాదు

  • సునీల్ అరోరాను కలిసిన సునీతారెడ్డి
  • తండ్రి హత్య కేసును ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని వినతి
  • నిన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన సునీత

కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధానాధికారి సునీల్ అరోరాను దివంగత వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణను ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర పోలీసులు చేపట్టే విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావని... ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విన్నవించారు. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడా సునీత తన భర్తతో కలసి నిన్న కలిసిన సంగతి తెలిసిందే.

More Telugu News