Telangana: టీకాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలో చేరనున్న సునీతా లక్ష్మారెడ్డి?

  • బీజేపీలో చేరేందుకు సిద్ధమైన సునీతా లక్ష్మారెడ్డి
  • పార్టీలో మంచి స్థానం కల్పిస్తామంటూ బీజేపీ హామీ
  • మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధం

టీఆర్ఎస్ దెబ్బకు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం సగం ఖాళీ అయింది. మిగిలిన వారిని లాగే పనిలో ఇప్పుడు బీజేపీ బిజీగా ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. తాజాగా, మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రెండు, మూడు రోజుల్లో ఆమె కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సరైన స్థానాన్ని కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు సునీతకు హామీ ఇచ్చారని సమాచారం. మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆమెకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News