Andhra Pradesh: వై.ఎస్.వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలి: పవన్ కల్యాణ్

  • వివేక హత్యకు గురి కావడం దిగ్భ్రాంతికి గురి చేసింది
  • వివేక భార్య, కుమార్తె సునీతకు ప్రగాఢ సానుభూతి
  • ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్

వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేక హత్యకు గురి కావడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతకు తన తరపున, జనసైనికుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. వివేక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో పవన్ తెలిపారు.

More Telugu News