amalapuram: టీడీపీ తరపున అమలాపురం లోక్‌సభ బరిలో హర్షకుమార్‌?

  • గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ
  • ఈవేళ చంద్రబాబును కలవనున్న మాజీ ఎంపీ
  • భేటీ అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం

అమలాపురం లోక్‌సభ నియోకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్‌ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో అమరావతిలో ఈరోజు హర్షకుమార్‌ భేటీకానుండడంతో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఈ స్థానం నుంచి హర్షకుమార్‌ పోటీ చేసి గెలుపొందారు.

 రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో కాంగ్రెస్‌ ప్రాభవం కోల్పోవడంతో హర్షకుమార్‌ ఈసారి సైకిలెక్కి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హర్షకుమార్‌తో భేటీ అనంతరం ఈ విషయంపై చంద్రబాబు ఒక ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభకు హర్షకుమార్‌ పేరు ఖరారైతే అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జి.ఎం.సి. హరీష్‌మాధుర్‌ను పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు.

More Telugu News