Guntur District: తాడేపల్లిలో నూతన గృహప్రవేశం చేయనున్న వైఎస్ జగన్

  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతన గృహం
  • ఈ నెల 27న కొత్త ఇంట్లోకి ప్రవేశం
  • అదేరోజు వైసీపీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో వెళ్లనున్నారు. ఈ నెల 27న నూతన గృహ ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా, వైసీపీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా అదేరోజు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలు... రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు.

More Telugu News