Andhra Pradesh: చంద్రబాబు సామాజిక వర్గం నాకు ఎన్నో అవాంతరాలు సృష్టించాలని చూసింది: ఆమంచి ఆరోపణలు

  • ఈ విషయాన్ని లోకేశ్, పరిటాల సునీతకు చెప్పాను
  • అయినప్పటికీ, వారు స్పందించ లేదు  
  • నాపై, అనుచరులపై 170 అక్రమ కేసులు పెట్టారు

ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీపైన, ఆ పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు తనకు ఎన్నో అవాంతరాలు సృష్టించాలని చూశారని ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రులు నారా లోకేశ్, పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, తాను టీడీపీలోకి వచ్చాక, అంటే, ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో తనపైన, తన అనుచరులపైనా 170 అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 

More Telugu News