Krishna River: కృష్ణానదిలో బోటులో చెలరేగిన మంటలు.. చంద్రబాబు నివాసానికి సమీపంలో ఘటన

  • జెట్టీకి కట్టిన బోటు నుంచి మంటలు
  • స్థానికుల కేకలతో నిర్వాహకులు అప్రమత్తం
  • ఆకతాయిల పనేనని అనుమానం

కృష్ణానదిలో ఓ ప్రైవేటు బోటుకు మంటలు అంటుకోవడం కలకలానికి దారితీసింది. తాడేపల్లి వద్ద నదిలో జెట్టీకి కట్టిన బోటు నుంచి సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో బోటు నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.

ఈ బోటు రైడింగ్‌కు అనుమతి లేకపోవడంతో దీనిని కృష్ణానదిలో జెట్టీకి కట్టి ఉంచారు. చాంపియన్స్ యాచ్‌క్లబ్‌కు చెందిన క్రూయిజ్ బోటుగా అధికారులు దీనిని గుర్తించారు. ఆకతాయిల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.

More Telugu News