Team India: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. మ్యాచ్ నుంచి ధోనీ అవుట్

  • తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీ
  • ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్
  • మళ్లీ జట్టులోకి వచ్చిన పాండ్యా

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనూయ్‌లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు.  

నేపియర్, మౌంట్ మాంగనూయ్‌లలో జరిగిన తొలి, రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకుని  సిరీస్‌ను ఇక్కడే దక్కించుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, దారుణమైన ఆటతీరుతో పర్యాటక జట్టుకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న కివీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. కాగా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ షమీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి కోలిన్ మన్రో (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

More Telugu News