priyadarshi: 'మిఠాయ్' నుంచి టీజర్ రిలీజ్

  • కొత్త కాన్సెప్ట్ తో 'మిఠాయ్'
  • దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం
  •  వచ్చేనెల 22న విడుదల       

ప్రియదర్శి .. కమల్ కామరాజు .. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా 'మిఠాయ్' సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

 గాడిదపై ఒక వ్యక్తి కూర్చుని ఉండగా, ప్రియదర్శి దాని మెడకు తాడు కట్టి లాగుతూ " ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా .. మంచి రోజులు వస్తున్నాయి .. మీ అందరి జీవితాల్లోకి వెలుగులు తెస్తున్నాయి .. " అని ఢమరుకం మోగిస్తూ చెబుతూ, ఒక్కసారిగా భయపడి ఆ గాడిదను అక్కడ వదిలేసి పరుగులు తీస్తాడు. వచ్చేనెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న 'మిఠాయ్' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News